చిన్న జయంతికి ముస్తాబ్ అవుతున్న కొండగట్టు

చిన్న జయంతికి ముస్తాబ్ అవుతున్న కొండగట్టు

ముద్ర, మల్యాల : మండలంలోని కొండగట్టు అంజన్నచిన్న జయంతి ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు జరిగే వేడుకలకు ఏర్పాట్లు అరకొరగా సాగుతుండడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగ కోనేరులోని వాటర్ మురికిగా మారడం, చెత్తాచెదారం, కొబ్బరి ముక్కలు నీటిలో ఉండడం భక్తులు తీరు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మురికి నీటిలో స్నానమాచరించి ఆంజనేయుని దర్శించుకోవడం అభ్యంతరం వ్యక్తం చేశారు.

భక్తులకు అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలగకుండా ఆరోగ్య ఉప కేంద్రాలు, రెండు అంబులెన్సులు ఏర్పాటు చేసినట్లు మల్యాల, కొడిమ్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర డాక్టర్లు మౌనిక, పరమేశ్వరి తెలిపారు. భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉండడంతో పారిశుద్ధ్య, వెహికల్ పార్కింగ్, ఆరోగ్య కేంద్రం తోపాటు నాలుగు లక్షల లడ్డూలు అందుబాటులో ఉంచినట్లు అన్ని శాఖల సిబ్బంది భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు.