15 మంది నిరుపేదలకు  ఉచిత కంటి ఆపరేషన్లు చేసిన ఎమ్మెల్యే

15 మంది నిరుపేదలకు  ఉచిత కంటి ఆపరేషన్లు చేసిన ఎమ్మెల్యే

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల పావని కంటి ఆసుపత్రి, ఆపి,రోటరీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గంలోని వివిధ గ్రామాల కు చెందిన 15 మంది నిరుపేదలకు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్  ఉచిత కంటి ఆపరేషన్లు చేశారు. అనంతరం ఉచితంగా కంటి అద్దాలు, మందులు అందజేశారు.ఈ కార్యక్రమంలో  దుమాల రాజ్ కుమార్,రంగు మహేష్,అర్వపల్లి శ్రీనివాస్,ఎలుమాద్రి కిషోర్, డా.విజయ్,నాయకులు, ఆసుపత్రి సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.