ఎమ్మెల్సీ ఎల్ రమణకు పితృవియోగం

ఎమ్మెల్సీ ఎల్ రమణకు పితృవియోగం
  • నివాళులర్పించిన పలువురు ప్రముఖులు

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ తండ్రి ఎల్.జి రాం అనారోగ్యంతో మృతి చెందారు. జగిత్యాలలోని ఎల్ . రమణ స్వగృహంలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, రాధిక, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు దావా వసంత, సురేష్  దంపతులు ఎల్ జి. రామ్  పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఎమ్మేల్యే, జడ్పీ చైర్ పర్సన్ తో పాటు, మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బోగస్రావని ప్రవీణ్ తో పాటు పలువురు ప్రముఖులు ఎల్ రమణను పరామర్శించారు.