కేసీఆర్ కుటుంబం చేతిలో బందీగా మారిన తెలంగాణ..

కేసీఆర్ కుటుంబం చేతిలో బందీగా మారిన తెలంగాణ..

మెట్‌పల్లి ముద్ర: కోట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం చేతిలో బందీగా మారిందని.కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ ఖుతుబోద్దిన్ పాషా అన్నారు.కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని టీ పీ సీ సీ డెలిగేట్ కల్వకుంట్ల సుజీత్ రావు తో కలసి ఆయన ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థి అమరుల త్యాగాలకు చలించిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించిందని.త్యాగాల తెలంగాణలో కేసీఆర్ కుటుంబం బోగలను అనుభవిస్తుందన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు చేసిన ఉద్యమకారులను ముఖ్యమంత్రి గుర్తించకపోవడం సిగ్గుచేటు అన్నారు. టీపీసీసీ ఫిషర్ మెన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రుత్త నారాయణ,టీపీసీసీ మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ ఆర్ అక్బర్, ఉమ్మడి జిల్లా మత్స్య కార్మిక డైరెక్టర్ కల్లెడ గంగాధర్,బైండ్ల శ్రీకాంత్, జాఫర్,కాంగ్రెస్ యూత్ నాయకులు ముద్దం ప్రశాంత్, కోరే రాజు కుమార్, గద్దల భరత్  రాజ్,అనిల్, షజాబ్, అష్రాఫ్,కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షుడు యండి రాజీ,  ఫక్రోదిన్, అన్వర్,రఘు,షూపియన్, శ్రీకాంత్ లు పాల్గొన్నారు.