పోలీసు శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

పోలీసు శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో, జిల్లా పోలీస్ కార్యాలయంలో, సాయుధ దళ కార్యాలయంలో గౌరవ వందనం అనంతరం ఎస్పీప్రవీణ్ కుమార్ పతాకావిష్కరణ గావించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంతో మంది అమరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చేందుకు పోలీస్ శాఖ పై గురుతర బాధ్యత ఉందన్నారు. అందుకు పోలీస్ సిబ్బంది మరింత బాధ్యతతో పని చేయాలనీ, రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ధనిక, పేద తేడాలు లేకుండా ఒకే రకమైన సేవలు అందించాలని అందుకు ప్రతి ఒక సిబ్బంది బాధ్యతతో పని చేసి పోలీసు శాఖకు మంచి పేరు తీసుకరావాలని కోరారు. 

ఈ సమావేశంలో భైంసా ఎఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఐపిఎస్.., నిర్మల్ డిఎస్పీ జీవన్ రెడ్డి, డిసిఅర్బి డిఎస్పీ రవీందర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, నిర్మల్ పట్టణ సిఐ మల్లేష్, అర్ఐలు రమేష్, రామక్రిష్ణ, యంటిఓ వినోద్, ఎస్ఐలు, ఎస్బీ, కార్యాలయ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.