బుద్ధుని బోధనలు ఆచరణీయం

బుద్ధుని బోధనలు ఆచరణీయం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: గౌతమ బుద్ధుడు బోధించిన మార్గం నేటి సమాజానికి శిరోధార్యం అని నిర్మల్ జిల్లా లోకేశ్వరం ఎంపిపి లలిత భోజన్న అన్నారు. శుక్రవారం మండలంలోని మన్మధ్ లో  బుద్ధజయంతి వేడుకలను నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పూజించారు.ఈ కార్యక్రమంలోసర్పంచులు శేఖర్ రెడ్డి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.