సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల సమస్యలు తీర్చండి
ముద్ర ప్రతినిధి, నిర్మల్:ఒప్పంద ఉద్యోగులను క్రమబద్దీకరించాలని, కనీస వేతనం చెల్లించాలని కోరుతూ తెలంగాణ సమగ్ర శిక్షా అభియాన్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని క్యాంప్ కార్యాలయంలో మంగళ వారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఉద్యోగులను క్రమబద్ధీకరించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. దీనికి స్పందించి ముఖ్యమంత్రి కే సి ఆర్ దృష్టికి తీసుకెళ్ళి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి ఇంద్రకరణ్ హామీ ఇచ్చారు.