ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
  • ఆత్మీయ సమ్మేళనం లో అల్లోల

ముద్ర ప్రతినిధి,నిర్మల్: ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోందని, వాటిని సామాన్యులకు తెలిసేలా ప్రతి కార్యకర్త పని చేయాలని రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బి ఆర్ ఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆత్మీయ సమ్మేళనాల్లో భాగంగా శుక్రవారం నిర్మల్ పట్టణంలోని బంగల్ పేట్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు పర్యాయాలు ప్రజల ఆశీస్సులతో గెలిచామని, ఈ సారి కూడా గెలిచి సత్తా చాటాల్సిన అవసరం ఉందన్నారు. కోట్లాది రూపాయలను ప్రజలకోసం వెచ్చిస్తున్న ప్రభుత్వ కృషిని ప్రతి ఒక్కరికీ వివరించాలని కోరారు. ప్రతిపక్షాల విమర్శలను సమర్ధంగా తిప్పికొడుతూ ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ సహా పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.