చేపలు పట్టడానికి వెళ్లి... మృత్యువు ఒడిలోకి.....!

చేపలు పట్టడానికి వెళ్లి... మృత్యువు ఒడిలోకి.....!

బాన్సువాడ, ముద్ర: చేపలు పట్టడానికి వెళ్లిన ఓ వ్యక్తి మృత్యువు ఒడిలోకి చేరుకున్నాడు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పోలీసు స్టేషన్ పరిధిలో గల సోమేశ్వర్ గ్రామ వాసి అయిన ఆర్.మారుతి ఈ నెల 5న సమీపంలోని కొల్లూరు చెరువుకు చేపలు పట్టడానికి వెళ్ళాడు. అయితే మరుసటి రోజు ఇంటికి రాకపోవడంతో అతని భార్య లక్ష్మీ కొల్లూరు గ్రామానికి వెళ్లి విచారించగా, వాగులో శవమై తెలాడని తెలిసింది.

దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా, శవాన్ని గ్రామస్తులతో కలిసి వాగులో నుంచి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.