అమ్మవారిని దర్శించుకున్న హై కోర్ట్ న్యాయమూర్తి

అమ్మవారిని దర్శించుకున్న హై కోర్ట్ న్యాయమూర్తి

ముద్ర ప్రతినిధి, నిర్మల్:తెలంగాణా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి సూరేపల్లి నంద తమ కుటుంబ సభ్యులతో బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారిని ఆదివారం దర్శించు కున్నారు. ఈ సందర్భంగా ఆలయ  ఏ ఈ ఓ, పూజారులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు అందజేశారు.