విద్యుదాఘతంతో వ్యక్తి మృతి

విద్యుదాఘతంతో వ్యక్తి మృతి

హుజూర్ నగర్ ముద్ర:సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణం మట్టపల్లి బైపాస్ రోడ్డు కు చెందిన గోసుల వీరబాబు (32) అనే వ్యక్తి విద్యుదాఘతంతో మృతి చెందాడు.మంగళవారం వ్యవసాయ పొలంలోని మోటార్ పని చేయకపోవడంతో మరమ్మత్తులు చేస్తుండగా స్విచ్ ఆన్ ఆఫ్ చేసి టెస్టింగ్ చేసే క్రమంలో వీరబాబుకు కరెంట్ షాక్ తగలడంతో స్పృహ కోల్పోయాడు. పక్క పొలంలో పనిచేస్తున్న రైతు కూలీలు వీరబాబును వెంటనే హుజూర్ నగర్ ఏరియా హాస్పిటల్ కు తరలించిన ఫలితం లేకపోయింది. ఆసుపత్రికి వచ్చే క్రమంలోనే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం హాస్పిటల్ సిబ్బంది మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. మృతుడు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. మృతునికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. రోజు తమ మధ్య తిరిగే వ్యక్తి ఇలా హఠాత్తుగా మరణించడంతో మృతుని బంధువులు కుటుంబ సభ్యులు బోరున విలపించారు.