మిజోరంలో కుప్ప‌కూలిన మ‌య‌న్మార్ విమానం

మిజోరంలో కుప్ప‌కూలిన మ‌య‌న్మార్ విమానం

ముద్ర,సెంట్రల్ డెస్క్:- మిజోరంలోని లెంగ్‌పుయ్ విమానాశ్రయంలో మ‌య‌న్మార్ కు చెందిన ఆర్మీ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలైనట్లు సమాచారం. వీరందరి పరిస్థితి విషమంగా ఉంది.గాయ‌ప‌డిన వారిని చికిత్స కోసం స‌మీపంలోని లెంగ్‌పుయ్‌ ఆస్పత్రిలో కి త‌ర‌లించారు. ఈ విమానంలో పైలట్‌తో పాటు మరో 14 మంది ఉన్నారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయ‌ని డిజిపి వెల్ల‌డించారు.