కార్యకర్తలకు అండగా ఉంటా - అధైర్యపడవద్దు

కార్యకర్తలకు అండగా ఉంటా - అధైర్యపడవద్దు
  • కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి

ముద్ర,పానుగల్:- కార్యకర్తలకు అండగా ఉంటానని ఎవరు అధైర్యపడవద్దని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు.మంగళవారం పానుగల్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రంగినేని అభిలాష్ రావుతో కలిసి  పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికార కాంగ్రెస్ పార్టీకి వందరోజుల సమయం ఇద్దామని అన్నారు.గ్రామాలలో మాజూరు చేసిన పనులు, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ అమలు విషయం లో పోరాటం చేయలన్నారు.రామన్న గట్టు,పస్పుల బ్రాంచ్ కెనాల్ వైండనింగ్ పనులు , శంకుస్థాపన చేసిన ఎమ్మార్వో భవనాలను పూర్తి చేయాలని కోరారు.నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని రానున్న స్థానిక ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు.

రైతులకు సాగునీరు ఇయ్యలేము అని అనడం విడ్డూరమని,కాంగ్రెస్  ప్రభుత్వం రైతుల పక్షాన ఆలోచించి కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి  మాట్లాడి రైతులకు సాగునీరు  అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.పాన్ గల్ మండలం అన్ని రంగాలలో అభివృద్ధిలో ముందు ఉంచామని కానీ కార్యకర్తలు నాయకుల సమన్వయ లోపం వలన ప్రజలకు చేరువ కాలేకపోయామని ఇప్పుడు ప్రతి ఒక్కరు సమన్వయంతో ఉండాలని అన్నారు.ఈ సమావేశంలో  ఎంపీపీ శ్రీధర్ రెడ్డి, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ నాయక్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు వెంకటయ్య నాయుడు,వీరసాగర్,రాజేష్ రెడ్డి,వివిధ గ్రామాల ఎంపిటిసిలు,సర్పంచులు ,గ్రామాల పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.