బీఆర్ఎస్ మేనిఫేస్టోతో  ప్రతిపక్షాల మైండ్ బ్లాక్

బీఆర్ఎస్ మేనిఫేస్టోతో  ప్రతిపక్షాల మైండ్ బ్లాక్

మంత్రి హరీశ్ రావు

ముద్ర, తెలంగాణ బ్యూరో : త్వరలో బీఆర్ఎస్ మేనిఫేస్టో విడుదల చేయబోతున్నామని, దానిని చూసిన ప్రతిపక్ష నేతలకు మైండ్ బ్లాక్ అవడం ఖాయమని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. రాష్ట్రంలో మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్నారు. కేసీఆర్ సీఎంగా ప్రమాణం చేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ లో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో హరీశ్​రావు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ మొదటి ఎన్నికల సభ హుస్నాబాద్ నుంచే ప్రారంభమవుతుందని తెలిపారు. అనంతరం సీఎం సభ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు.  అసత్య సర్వేలతో అధికారంలోకి వస్తామనే భ్రమలో కాంగ్రెస్ నేతలు ఉన్నారని మంత్రి విమర్శించారు. కనీసం టికెట్లు ఇచ్చుకోలేని దయనీయ స్థితిలో ఆ పార్టీ ఉందని ఆయన ఎద్దేవా చేశారు.