జగన్ పై రాయి దాడి కేసులో పురోగతి...

జగన్ పై రాయి దాడి కేసులో పురోగతి...

ముద్ర,అమరావతి: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై రాయి దాడి కేసులో పురోగతి లభించింది. ఐదుగురు యువకులను సిట్ అదుపులోకి తీసుకుంది. అనుమానితులు సిసిఎస్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. అజిత్‌సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన యువకులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికులు తీసిన వీడియోలను పోలీసులు పరిశీలించి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. విజయవాడలోని సింగ్‌నగర్‌లో మేమంతా సిద్దం బస్సుయాత్రలో ఉన్న సిఎం జగన్‌పై రాయితో దాడి చేసిన విషయం తెలిసిందే. స్కూల్, గంగానమ్మ గుడి మధ్య  గురి చూసి పదునైన రాయితో సిఎం జగన్‌పై దాడి చేసినట్టు పోలీసులు గుర్తించారు.