టీడీపీలోకి కన్నా లక్ష్మీనారాయణ

టీడీపీలోకి కన్నా లక్ష్మీనారాయణ

అమరావతి: మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ  తెలుగుదేశం  పార్టీలో చేరారు. గురువారం మధ్యాహ్నం గుంటూరులోని తన నివాసం నుంచి అనుచరులు, అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా మంగళగిరిలోని తెదేపా పార్టీ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు.  వందలాది వాహనాల్లో కన్నా అనుచరులు నినాదాలు చేస్తూ ఆయన వెంట వచ్చారు.

ముందుగా నిశ్చయించుకున్న ముహూర్తం ప్రకారం మధ్యాహ్నం 2.48 గంటలకు అధినేత చంద్రబాబు  సమక్షంలో కన్నా తెలుగుదేశం పార్టీలో చేరారు. పసుపు కండువా కప్పి కన్నా లక్ష్మీనారాయణను చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. కన్నాతో పాటు ఆయన అనుచరులు వేలాదిగా టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ నెల 16న కన్నా లక్ష్మీనారాయణ  బీజేపీకి  రాజీనామా చేసిన విషయం తెలిసిందే.