రాహుల్ గాంధీ హెలికాప్టర్‌ను తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు

రాహుల్ గాంధీ హెలికాప్టర్‌ను తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు

నీల్ గిరిస్ (తమిళనాడు): రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ను తమిళనాడులో సోమవారం ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. రాహుల్ గాంధీ తన పార్లమెంటరీ నియోజకవర్గం కేరళలోని వయనాఢ్ కు వెళ్తున్నారు. అక్కడ బహిరంగసభలో సహా ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సివుంది. హెలికాఫ్టర్ తమిళనాడులోని నీల్ గిరీస్ లో ల్యాండ్ అయిన సందర్బంగా ఎన్నికల అధికారులు తనిఖీలు చేశారు. ఏప్రిల్ 26న జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్‌ నుంచి వరుసగా ఆయన పోటీ చేస్తున్నారు.