ఎంపిగా కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని ప్రభుత్వవిప్ ప్రచారం

ఎంపిగా కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని ప్రభుత్వవిప్ ప్రచారం

ముద్ర ప్రతినిధి భువనగిరి : భువనగిరి ఎంపిగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని ప్రభుత్వవిప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. సోమవారం  యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో ఆయన స్థానిక సంస్థ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులతో కలిసి భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన హోటల్లో పూరీలు వేస్తూ వినూత్న తరహాలో చేపట్టారు.  చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ ముక్కెర్ల మల్లేష్ యాదవ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కానుగు బాలరాజు గౌడ్, సీనియర్ నాయకులు గుండ్లపల్లి భరత్ గౌడ్, పట్టణ అధ్యక్షులు బందారపు బిక్షపతి గౌడ్ పాల్గొన్నారు.