మెఫి ఆధ్వర్యంలో నేడు సెమినార్

మెఫి ఆధ్వర్యంలో నేడు సెమినార్

హైదరాబాద్: మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్, ఇండియా (మెఫి) ఆధ్వర్యంలో శనివారం నాడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో 'భారత రిపబ్లిక్ ఎదుర్కొంటున్న సంక్షోభం- విశ్లేషణ' అంశంపై ప్రముఖ రచయిత, రాజకీయ, ఆర్థిక విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ ప్రసంగిస్తారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి మెఫి అధ్యక్షుడు కే శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షత వహిస్తారని మెఫీ మేనేజింగ్ ట్రస్టీ దేవులపల్లి అమర్ తెలిపారు.