టీఎస్‌పీఎస్‌ బోర్డును రద్దు చేయాలి

టీఎస్‌పీఎస్‌ బోర్డును రద్దు చేయాలి

జనగామ : టీఎస్‌పీఎస్‌ బోర్డును తక్షణమే రద్దు చేయాలని స్వేరో స్టూడెంట్స్‌ యూనియన్‌ ఉమ్మడి వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు మారేపల్లి మనోజ్‌కుమార్‌‌, జిల్లా అధ్యక్షుడు మాదారపు విజయ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. యూనియన్‌ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు మంగళవారం జనగామ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్దలో ప్లకార్డులతో నిరసన తెలిపి రాజ్యాంగ నిర్మాత, బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి వినతి పత్రం అందించారు.

అనంతరం వారు మాట్లాడుతూ టీఎస్‌పీఎస్‌ జరుగుతున్న తప్పిదాలకు బాధ్యులైన బోర్డు చైర్మన్‌ జనార్దన్‌రెడ్డిని వెంటనే సస్పెండ్‌ చేయాలని, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బీఎస్‌వైజేఏసీ జిల్లా ఇంఛార్జి పవన్‌ కళ్యాణ్‌ ఎస్‌ఎస్‌యూ జిలా మహిళా కమిటీ ఇంఛార్జి స్వాతి, అనూష , రఘు , బీఎస్‌వైజేఏసీ చిల్పూరు మండల నాయకులు జీడి అనుఫ్‌, సాగర్‌ , శివ గారు, బీఎస్‌వైజేఏసీ జఫర్‌‌గఢ్‌ మండల నాయకులు ఎడ్ల సందీప్‌, తదితరులు పాల్గొన్నారు.