పురవీధుల్లో సాగిన రథోత్సవం

పురవీధుల్లో సాగిన రథోత్సవం

దర్శించి.. తరించిన భక్తులు

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలోని పురవీధుల్లో శ్రీబుగులు వెంకటేశ్వర స్వామి రథోత్సవం భక్తి పరవశంతో సాగింది. స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏడో రోజు శనివారం సాయంత్రం రథోత్సవాన్ని ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, దేవాలయ ఈఓ వెంకట్రావు ప్రారంభించారు. కర్ణాటక నుంచి తెప్పించిన ప్రత్యేక వాచ్య బృందంతో పాటు స్థానిక కోలాట కళాకారులు రథోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

అర్చకులు బ్రాహ్మణపల్లి రవీందర్ శర్మ, సౌమిత్రి శ్రీరంగాచార్యులు, వేదాంతం మురళీధర్ ఆచార్యులు,  కృష్ణమాచార్యులు, గట్టు కేశవాచార్యలు, గట్టు తేన రంగ చార్యులు,  పవన్ కుమారాచార్యులు ధర్మకర్తలు, భక్తులు, సిబ్బంది రథోత్సవ ఊరేగింపులు పాల్గొన్నారు. పురవీధుల్లో ప్రత్యేకంగా అలంకరించిన రథంపై ఊరేగుతున్న భూదేవి సమ్మెతుడైన శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకుని భక్తులు తరించారు. స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా మాచర్ల సత్యనారాయణ, స్వరూప, మాచర్ల రాజేష్, సుప్రియ దంపతులు స్వామివారికి రూ. 53,220లు విరాళంగా ఇచ్చారు.