ఫంక్షన్ హాల్ నిర్మాణాన్ని అడ్డుకున్న గ్రామ ప్రజలు 

ఫంక్షన్ హాల్ నిర్మాణాన్ని అడ్డుకున్న గ్రామ ప్రజలు 

గుండాల జూన్ 10 (ముద్ర న్యూస్):- యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల పరిధిలోని అనంతరం గ్రామంలో ఫంక్షన్ హాల్ నిర్మాణం కొరకై చామల సోమిరెడ్డి పర్మిషన్లతో దరఖాస్తు చేసుకున్నాడు. ఇట్టి ఫంక్షన్ హాల్ ప్రభుత్వ పాఠశాలకు 400 మీటర్ల అతి దగ్గరగా ఉండడంతో ఫంక్షన్ హాల్ కు ఇరువైపులా ప్రజల ఇండ్లు ఉండడంతో ప్రజలంతా ఒక్కటై పేసరు రేఖా రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా,ప్రజలు మాట్లాడుతూ చామల సోమిరెడ్డి అన్ని పర్మిషన్లు నాకు ఉన్నాయని ఫంక్షన్ హాల్ పెట్టి ఎట్టి పరిస్థితిలోనైనా నిర్మిస్తానని ప్రజలకు ఇబ్బందికరంగా మాట్లాడుతున్నారు, ఫంక్షన్ హాల్ నిర్మించినట్లయితే చుట్టుపక్కల ఇండ్ల వాళ్లకి డీజే సౌండ్ లతో ఫంక్షన్లు జరిపిన నేపద్యం లో మద్యం తాగి పక్కల ఉన్న ఇండ్ల  ఇబ్బందులకు గురవుతారు,కాబట్టి ఫంక్షన్ హాల్  ఊరికి చివరగా నిర్మించాలని కోరారు.

ఇరు వర్గాలను అభిప్రాయాన్ని చేర్చుకోవడానికి డి ఎల్ పి ఓ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో పిటిషన్ దారులు అయిన పెసర రేఖ రెడ్డి శ్యామలకి సోమిరెడ్డిని గ్రామపంచాయతీ దగ్గర వారి వాదనలు విని ప్రజల అవసరాలు దృష్ట్యా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.అనంతరం శ్యామల సోమిరెడ్డి మాట్లాడుతూ.నాకు అన్ని రకాల పర్మిషన్లు ఉన్నాయనీ హైదరాబాదులో కూడా నాలుగు ఫంక్షన్లు నడుపుతున్నానని దీనికి కూడా పర్మిషన్ తీసుకొని నిర్మిస్తానని తెలిపారు.ప్రజలకు ఇబ్బందిగా ఉంది నిర్మించోద్దని ప్రభుత్వ అధికారి చెప్పినట్లయితే మరొకచోట నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.