కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అoడెం సంజీవ రెడ్డి కి సన్మానం

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అoడెం సంజీవ రెడ్డి కి సన్మానం

భువనగిరి ఆగస్టు 14 (ముద్ర న్యూస్): యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుని హైదరాబాద్ తన నివాసంలో కలిసి కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు చిన్నం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా  సన్మానించారు.ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఇంటిటికి తీసుకువెళ్లాలని అని అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని దీమ వక్తం చేశారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు చిన్నం శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ దేవరకొండ నరసింహ చారి, చందుపట్ల గ్రామ శాఖ అధ్యక్షులు చిన్నం వెంకటేష్, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిదరకంటి సురేష్ , ఎస్టీ సేల్ మండల అధ్యక్షులు భూక్య రమేష్ నాయక్, రెడ్యానాయక్ తండ ఉప సర్పంచ్ శ్రీనివాస్, భూక్య మధు, భూక్య దేవి సింగ్, తదితరులు పాల్గొన్నారు.