సీఎం సహాయనిది చెక్కులు పంపిణీ
- మా దగ్గరకు వచ్చిన ప్రతి అప్లికేషన్ తీసుకుంటున్నాం..
- 15మంది లబ్దిదారులకు రూ.759500/-ల సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ.
- కార్యాలయ అవరణలో మొక్కలు నాటిన ఎమ్మేల్యే గండ్ర
ముద్ర న్యూస్ రేగొండ: భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంకి వచ్చిన ప్రతి అప్లికేషన్ పార్టీలకు అతీతంగా తీసుకుని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రత్యేక చొరవతో సీఎం సహాయ నిధి చెక్కులని ఇస్తున్నామని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు సోమవారం, రేగొండ మండల కేంద్రలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 15 మంది లబ్దిదారులకు రూ.7.59.500/-ల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులని లబ్దిదారుల కుటుంబాలకు అందించారు. ఏ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనారోగ్యంతో దవాఖానాల్లో చికిత్స పొంది బిల్లులను అందించిన చాలా మంది కుటుంబలను సీఎం సహాయ నిధి ద్వారా చెక్కులను అందించడం జరుగుతున్నది.చాలా సార్లు పార్టీలకు అతీతంగా బాధిత కుటుంబాలకు అందిస్తున్నాం.నీమ్స్ దవాఖానలో చికిత్స కోసం వెళ్లిన రోగులకు ఎల్ ఓ సి ద్వారా కూడా సహాయం అందించడం జరుగుతున్నదని గుర్తు చేశారు.ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ప్రజా ప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీడీఓ సురేందర్ ,తహశీల్దార్ శ్రీనివాస్ స్వామి,ఎంపీపీ పున్నం లక్ష్మి జడ్పీటీసీ సాయిని విజయ, రైతు బంధు జిల్లా కోఆర్డినేటర్ హింగే మహేందర్, మండల ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, పాల్గొన్నారు.