పెద్దపల్లి జిల్లాలో మానవత్వం  మంట గలిచిన వేళ

పెద్దపల్లి జిల్లాలో మానవత్వం  మంట గలిచిన వేళ
  • పూసాలలో బండరాయితో కొట్టి తండ్రిని చంపిన తనయుడు

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి:  ఓ తండ్రిని తనయుడు చంపి మానవత్వాన్ని మంటగలిపిన ఘటన పెద్దపల్లి జిల్లాలోని పూసాల గ్రామంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది.స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మండలంలోని  పూసాల గ్రామం లో తీగల నరసయ్య, కుమారుడు తీగల రాజేశం నివాసం ఉంటున్నారు. అయితే వాళ్ళు పండించిన పంటను విక్రయించేందుకు పూసాలలోని ఐకెపి సెంటర్ కు తీసుకుపోయరు. అనంతరం పూసాలలోని ఐకెపి సెంటర్ లో ధాన్యం విక్రయిస్తుండగా తండ్రి కొడుకుల మధ్య ఘర్షణ నెలకొంది. 

ఈ నేపథ్యంలో  కొడుకు రాజేశం ఆవేశానికి లోనై య్యాడు. దీంతోవిచక్షణ కోల్పో యిన రాజేశం కన్న తండ్రిని పక్కనే ఉన్న బండరాయితో తండ్రి నరసయ్య తల పైన బలంగా కొట్టాడు, దీంతో తీవ్ర రక్తస్రావానికి గురైన తండ్రి నరసయ్య అక్కడికక్కడే మృతిచెందాడు.  స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. కాగా తీగల నరసయ్య మృతదేహాన్ని శవ పరీక్షల నిమిత్తం తరలించారు. కాగా నిందితుడు రాజేశం  గతంలో కూడా తన సొంత గ్రామమైన కాచాపూర్ లో ఒకరిని హత్య చేసినట్టు గ్రామస్తులు తెలిపారు .