గోదావరిఖనిలో విషాదం కల్తీ కల్లు సేవించి ఇద్దరు మృతి.

గోదావరిఖనిలో విషాదం కల్తీ కల్లు సేవించి ఇద్దరు మృతి.

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని బుధవారం రాత్రి విషాదం నెలకొంది. పట్టణ సమీపంలోని అడ్డగుంటపల్లిలో కల్తీ కల్లు సేవించిన ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. అడ్డగుంటపల్లి కి చెందిన నవీన్, మామిడి రమేష్ అనే కూలీలుగా గుర్తింపు, మృతదేహలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.నెంబర్ వన్ కల్లు డిపోలో ఇద్దరు కల్లు సేవించారని స్థానికులు తేలుతున్నారు.