కలెక్షన్స్ పరంగా చరిత్ర సృష్టిస్తున్న ఆదిపురుష్ :నిర్మాతలు

కలెక్షన్స్ పరంగా చరిత్ర సృష్టిస్తున్న ఆదిపురుష్ :నిర్మాతలు

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అంచనాల మధ్య ఈరోజు రిలీజ్ అయిన సినిమా ఆదిపురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణ మహా గ్రంధం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటించిన ఈ సినిమా విడుదలకు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారా అనేక రికార్డులను బద్దలు కొట్టింది. ఇక ఈరోజు విడుదలైన దగ్గర నుంచి సూపర్ కలెక్షన్స్ సొంతం చేసుకుంటుంది.  550 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమాకి మార్నింగ్ షో నుంచే మంచి రెస్పాన్స్ వస్తూ ఉండటంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ని ఈరోజు సాయంత్రం నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్ కి యు.వి. క్రియేషన్స్ వంశీకృష్ణ రెడ్డి గారు కూడా అటెండ్ అయ్యారు.  ఈ సందర్బంగా మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ శశి మాట్లాడుతూ…"మేము మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్.ఎల్.పి వైజాగ్ లో పెట్టి ఇంచుమించు ఇది ఆరో నెల. మేము ఆది పురష్ సినిమా మా ప్రయత్నం చేస్తే వచ్చింది అనేదానికన్నా, ఆ రాముడు భక్తుడిగా మా మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్లను ఎంచుకున్నారు అనేది మా నమ్మకం. ఈ జనరేషన్ లో ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క సినీ ప్రేక్షకుడు కి ఇలాంటి గొప్ప సినిమా తీసుకెళ్లడానికి  మాకు గొప్ప అవకాశం ఇచ్చారు ఆ రాముడు అని మేము భావిస్తున్నాం. మా మైత్రి నవీన్ గారు కూడా ఈ సినిమా యూఎస్ లో చూసి, శశి చాలా బాగుంది అని చెప్పారు. వీస్ లో ఒకటి అవుతుందని గట్టిగా నమ్ముతున్నాను. ప్రతి దగ్గర నుంచి ఒకటే మెసేజెస్ మరియు కాల్స్ వస్తున్నాయి.