తెలంగాణ బిడ్డలారా.. కేసీఆర్ మిమ్మల్ని చూస్తారట

తెలంగాణ బిడ్డలారా.. కేసీఆర్ మిమ్మల్ని చూస్తారట

ముఖ్యమంత్రి కేసీఆర్  జిల్లాల పర్యటనపై బీజేపీ నేత విజయశాంతి  తనదైన రీతిలో స్పందించారు. కేసీఆర్  గురువారం  ఖమ్మం , వరంగల్ జిల్లాలో పర్యటించి అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. దీనిపై విజయశాంతి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ... ''తెలంగాణ బిడ్డలారా... ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మిమ్మలను చూస్తారట. ఏడాదికోసారి అచ్చే ఉగాది లెక్క.. మల్ల ఎప్పుడు కన్పడ్తరో.. లేదో ఈ గాలి మోటార్లలో తిరిగే దొరగారు ? స్వాగతిస్తరో... లేదా ఓటు ద్వారా వచ్చే ఎన్నికలల్ల సెలవిస్తమని చెప్తరో మీ విజ్ఞత'' అంటూ సోషల్ మీడియా వేదికగా సెటైరికల్ పోస్ట్ చేశారు.