హత్య కేసులో నిందితుల అరెస్ట్

హత్య కేసులో నిందితుల అరెస్ట్
accused Arrest in the murder case

ముద్ర, వరంగల్ క్రైం: ఈ నెల 2న కడిపికొండలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన ఇద్దరిని అరెస్ట్ చేసి బైక్ తో పాటు గొడ్డలి, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కాజీపేట ఏసీపీ శ్రీనివాస్ కథనం ప్రకారం.. కడిపికొండ గ్రామానికి చెందిన పెసర వినయ్ @ ఆగమ్ రైల్వే ఉద్యోగి. తన ఆర్థిక అవసరాల కోసం అదే గ్రామానికి చెందిన తన బంధువైన జిర్ర ప్రదీప్ కుమార్ వద్ద నుంచి నాలుగేళ్ల కిందట ఐదు లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. జిర్ర ప్రదీప్ అప్పు ఇచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వాలని పెసర వినయ్ అనే అతన్ని అడగగా ఇవ్వకుండా వాయిదా వేస్తున్నాడు.

దీంతో కొంతకాలంగా వారిద్దరి మధ్య గొడవలు జరిగుతున్నాయి. ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న వినయ్  జిర్ర ప్రదీప్ కుమార్ ను చంపాలని ఉద్దేశంతో తన స్నేహితుడైన కాసబోయిన గోపికృష్ణ సాయంతో ఈ నెల 2న పథకం వేసాడు. డబ్బులు ఇస్తానని ప్రదీప్ ను నమ్మించి అయోధ్య పురం చర్చి వెనకాలకు పిలిచి గోపికృష్ణ సహకారంతో అతడి తల వెనుక భాగంలో గొడ్డలితో నరికి చంపాడు. తర్వాత పారిపోయి తిరుగుతూ గురువారం డబ్బుల కొరకు మోటార్ సైకిల్ ను అమ్మేందుకు వెళుతుండగా సమాచారం మేరకు భట్టుపల్లి సెంటర్ వద్ద మడికొండ పోలీసు పట్టుకున్నట్లు వెల్లడించారు.