బిఆర్ఎస్ విస్తృత ప్రచారం

బిఆర్ఎస్ విస్తృత ప్రచారం

ముద్ర, తంగళ్ళపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం చిన్నా లింగాపూర్ గ్రామంలో సర్పంచ్ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో గడపగడప తిరుగుతూ బిఆర్ఎస్ సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తాను మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేదల కోసం తీసుకొస్తున్నటువంటి సంక్షేమాలను చూసే ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తారని, బి ఆర్ఎస్ పార్టీని మూడోసారి అధికారంలోకి తీసుకురావాలని యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామికి మొక్కులు చెల్లించుకుని వచ్చానని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ పడగల మానస, ఎ ఏం సి చైర్మన్ పూసపల్లి సరస్వతి, ఎంపిటిసి బైరినేని రాము,ఉప సర్పంచ్ పర్కల మల్లేశం,శ్యగ దేవేందర్, రాజేశ్వరరావు,గ్రామ శాఖ అనిల్,మోహన్ రెడ్డి, చికోటి మల్లేశం తదితరులు పాల్గొన్నారు.