బిఆర్ఎస్ ఏకగ్రీవ బూత్ ఎన్నికలు - బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రొట్టె రాజమౌళి 

బిఆర్ఎస్ ఏకగ్రీవ బూత్ ఎన్నికలు - బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రొట్టె రాజమౌళి 

దుబ్బాక,ముద్ర: సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని దుంపలపల్లి వార్డు కు సంబంధించిన రెండు వార్డులకు భారత రాష్ట్ర సమితి బూత్ అధ్యక్షులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు రొట్టె రాజమౌళి తెలిపారు దుంపలపల్లి గ్రామంలోని 50 వ బూత్ బిఆర్ ఎస్ పార్టీ అద్యక్షుడుగా బిజ్జ లింగయ్య, 51 వ బూతు బీఆర్ఎస్ అధ్యక్షుడుగా ధర్మా రెడ్డిరఘునందన్ రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు వారికి ఎన్నిక నియామక పత్రాలను రొట్టె రాజమౌళి ,ఎల్లారెడ్డి తదితరులు అందజేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మున్సిపల్ అద్యక్షుడు పల్లె వంశీకృష్ణ గౌడ్, నాయకులు గన్నే భూమి రెడ్డి,కౌన్సిలర్ ఇళ్ళందుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.