నాగర్ కర్నూలు BSP అసెంబ్లీ అధ్యక్షునిగా చికొండ్ర మహేష్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నిక...

నాగర్ కర్నూలు BSP అసెంబ్లీ అధ్యక్షునిగా చికొండ్ర మహేష్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నిక...

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:  రోజు బహుజన సమాజ్ పార్టీ(బిఎస్పీ) కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో నాగర్ కర్నూలు అసెంబ్లీకి అధ్యక్షునిగా చికొండ్ర మహేష్ యాదవ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అట్లాగే కళ్యాణ్ ను అసెంబ్లీ కమిటీ ప్రధాన కార్యదర్శిగా, మల్లేష్ ను తెల్కపల్లి మండల కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఇ కార్యక్రమంలో బిఎస్పీ అసెంబ్లీ ఇంచార్జ్ కొత్తపల్లి కుమార్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో నాగర్ కర్నూల్ గడ్డమీద బిఎస్పీ గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పని చేయాలని పిుపునిచ్చారు. ఓట్లు బహుజనులవి - సీట్లు దోపిడి కులాలకా అనీ ప్రశ్నించారు. ఇ విషయాన్ని గ్రామగ్రామాన ప్రచారం చేయాలని కోరారు. ఇ కార్యక్రమంలో బిఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పసుపుల రామకృష్ణ, జిల్లా ఇంచార్జ్ లు బిసమోళ్ళ యోసేఫ్, అంతటి నాగన్న, జిల్లా అధ్యక్షులు పృథ్వీరాజ్, అసెంబ్లీ ఇంచార్జ్ మోహన్ రెడ్డి, అసెంబ్లీ నాయకులు కొట్ర బాలు, పరుశ రాము, ఆనంద్, మండలాల అధ్యక్షులు శివ శంకర్, లక్ష్మణ్, రాంచందర్, సురేందర్ నాయకులు మడుపు నాగేష్, శేషు, నాగరాజు, మంగనూర్ రాజు, జల్లి మల్లేష్, సాయిబాబ, సుల్తాన్ లు పాల్గొన్నారు.