కలెక్టరేట్ లోని ప్రభుత్వ కార్యాలయాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్

కలెక్టరేట్ లోని ప్రభుత్వ కార్యాలయాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గల వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాలను బుధవారం కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఐడిఓసి గ్రౌండ్ ఫ్లోర్లోని కార్యాలయాలను కలెక్టర్ తనిఖీ చేసి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రతి సోమవారం ప్రజావాణి కి జిల్లా నలుమూలల నుంచి వచ్చే ప్రజల సౌకర్యవంతంగా కూర్చునేలా కుర్చీలను ఏర్పాటు చేసే ప్రదేశాన్ని ఆయన పరిశీలించి, త్రాగునీటి వసతి కల్పించేందుకు కలెక్టర్ తన వ్యక్తిగత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.కలెక్టరేట్ ఏ.ఓ, ఎన్ఐసి కార్యాలయాలతో పాటు మహిళా శిశు సంక్షేమ, గనులు భూగర్భ జల వనరులు తదితర శాఖలను తనిఖీ చేశారు. ఆయా కార్యాలయాల్లో నెలకొని ఉన్న వసతులను, నిర్వహణ తీరును గమనించి అధికారులకు పలు సూచనలు చేశారు.మొక్కలు గ్రీనరీ ని పరిశీలించి ప్రతిరోజు నీటిని మొక్కలకు అందించాలని సిబ్బందికి ఆదేశించారు.పరిశుభ్రత కలెక్టర్ సూచించారు.సిసి కెమోరాల ఏర్పాటు తదితర అంశాలపై కలెక్టర్ చర్చించారు.