సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే మర్రి 

సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే మర్రి 

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా: నాగర్ కర్నూల్ మున్సిపల్ పరిధిలోని 2వ వార్డులో అంచనా వ్యయం 1 కోటి 20 లక్షల రూపాయలతో 5 చోట్ల 1400 మీటర్ల పొడవు కొత్తగా వేస్తున్న సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి,ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈరోజు 2వ వార్డులో సుమారు 1 కోటి 20 లక్షల రూపాయలతో 1400 మీటర్ల పొడవు కొత్తగా సిసి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించము అని తెలిపారు, వర్షాభావ పరిస్థితుల్లో వారం 10 రోజుల్లో పని పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు సూచించారు,నాగర్ కర్నూల్ పట్టణంలో పెద్దఎత్తున అన్ని వార్డులో సీసీ రోడ్లు నిర్మిస్తున్నాము అని తెలిపారు,రోడ్డు వెడల్పు ఎక్కడైనా తగ్గితే ఆ ప్రదేశంలో ఉన్న ఇంటి వాళ్ళతో మాట్లాడి ఒప్పించి వెడల్పు తగ్గకుండా వెయ్యాలి అని సూచించారు, ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.