అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ ఆవిర్భావం

అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ ఆవిర్భావం

కేసముద్రం, ముద్ర: స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అలుపెరగని పోరాటం చేసిన ఉద్యమకారులను నిరంతరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని కేసముద్రం స్టేషన్ సర్పంచ్ బట్టు శ్రీనివాస్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఆవిర్భావ వేడుకలను సర్పంచ్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. అమరవీరుల స్థూపం వద్ద మార్కెట్ చైర్ పర్సన్ నీలం సుహాసిని దుర్గేష్, ఎంపిపి ఓలం చంద్రమోహన్, జడ్పిటిసి రావుల శ్రీనాథ్ రెడ్డి, వైస్ ఎంపీపీ రావుల నవీన్ రెడ్డి, రైతుబంధు మండల కన్వీనర్ దామర కొండ ప్రవీణ్ కుమార్, భారాస మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు నజీర్ అహ్మద్, శ్రీనివాస్ తదితరులు తెలంగాణ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను ఘనంగా సత్కరించారు