నేటి నుంచి రూ. 2 వేల నోట్ల మార్పిడి
నేటి నుంచి రూ. 2 వేల నోట్ల మార్పిడి ప్రారంభం. సెప్టెంబరు 30 వరకు మార్చకునే అవకాశం ఉంది. ఒకసారి 10 నోట్లు మాత్రమే మార్చకునే అవకాశం ఉంది. ఒక్కరోజులో ఎన్నిసార్లయిన నోట్లు మార్చుకోవచ్చు. ఎలాంటి ఐడీ ప్రూఫ్స్, బ్యాంకు అకౌంట్ అవసరం లేదు. రూ. 50 వేల కంటే ఎక్కువ మొత్తంలో చేసే డిపాజిట్లకు పాన్ కార్డ్ అవసరం. రూ. 2 వేల నోట్ల డిపాజిట్కూ ఇది వర్తిస్తుందని ఆర్బీఐ తెలిపింది. రూ. 2 వేల నోట్ల ఉపసంహరణపై ఈ నెల 19న ఆర్బీఐ ప్రకటన చేసింది. సెప్టెంబరు 30 తరువాత రూ. 2 వేల నోట్లు చెల్లవని ఆర్బీఐ చెప్పలేదు. పరిస్థితిని బట్టి ఏం చేయాలో ఆర్బీఐ తరువాత నిర్ణయిస్తుంది.