ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్ - నిమిషం నిబంధన సడలింపు

ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్ - నిమిషం నిబంధన సడలింపు

ముద్ర,తెలంగాణ:-ఇంటర్ పరీక్షలు జరుగుతున్న వేళ తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్క నిమిషం నిబంధనను సడలించింది. విద్యార్థులకు 5 నిమిషాల గ్రేస్‌ పీరియడ్‌కు అనుమతించింది. ఫలితంగా ఆలస్యంగా వచ్చిన స్టూడెంట్స్‌కు ఐదు నిమిషాల గ్రేస్‌ టైం ఉంటుంది.