బక్క నాగరాజు యాదవ్‌కు సన్మానం

బక్క నాగరాజు యాదవ్‌కు సన్మానం

ముద్ర ప్రతినిధి, జనగామ : బీఆర్‌‌ఎస్‌లో చేరిన తెలంగాణ ఉద్యమకారుడు, జనగామ సీనియర్ నేత బక్క నాగరాజు యాదవ్‌ను యాదవ సంఘం నాయకులు సోమవారం మర్యద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి సన్మానించారు. అనంతరం నాగరాజు యాదవ్ మాట్లాడుతూ  తెలంగాణ  ఉద్యమంలో  పనిచేసిన అనుభవంతో  పార్టీ  అభివృద్ధికి, జనగామ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌‌ రెడ్డి గెలుపునకు కృషి చేస్తానని పేర్కొన్నారు. అదేవిధంగా యాదవుల అనునిత్యం అండగా ఉంటానని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు వజ్జ పరశురాములు, సలేంద్రి  కొమురయ్య, యెల్లబోయిన కొమురయ్య, కత్తుల శ్రీనివాస్‌ యాదవ్​, వెంకటేశ్వర్లు, బోళ్ల  సంపత్, మారబోయిన  రాజు, కొండబోయిన రాజు, సింగరి  ప్రశాంత్,  ఆరేళ్ల నరేశ్‌,  కాస  భాస్కర్, గాజుల  నర్సింహులు,  బొంగు  శ్రీధర్,  సింగరి రాములు, మేడిదుల ప్రవీణ్ పాల్గొన్నారు.