శాంతి భద్రతల పరిరక్షణ ముఖ్యం - సిఐ సట్ల రాజు

శాంతి భద్రతల పరిరక్షణ ముఖ్యం - సిఐ సట్ల రాజు

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: శాంతి భద్రతల పరిరక్షణ ముఖ్యమని ప్రజల సహకారంతో మండలంలో శాంతి భద్రతలను కాపాడుతానని సీఐ సట్ల రాజు అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ సిఐ గా సట్ల రాజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో శాంతి భద్రత పరిరక్షణతో పాటు దొమ్మిలు దొంగతనాలు జరగకుండా ప్రజలకు రక్షణ కల్పించడం పోలీసుల బాధ్యత అన్నారు. ప్రజలు నిర్భయంగా పోలీస్ స్టేషన్ వచ్చి తమ సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు అన్నారు. కాగా గతంలో సిఐ గా బాధ్యతలు నిర్వహించిన ఏ.రాఘవేందర్ సిఎస్బి కి బదిలీ అయ్యారు. సిఐగా బాధితులు తీసుకున్న రాజు సిపి రవీంద్రనాథ్, స్థానిక ఏసీబీ శ్రీనివాసరావు డీసీపీలను మర్యాదపూర్వకంగా కలిశారు.