వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న జిల్లా వైద్యాధికారి

వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న జిల్లా వైద్యాధికారి

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: జనగాం జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలోని శ్రీ బుగులు వేంకటేశ్వర స్వామిని జనగామ జిల్లా వైద్యాధికారి( డిఎం అండ్ హెచ్ఓ) డి.రవీందర్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజ నిర్వహించారు. ప్రతి శనివారం నిర్వహించే స్వామి వారి వార కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించగా భక్తులు తిలకించి తరించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీమతి లక్ష్మీ ప్రసన్న అభివృద్ధి కమిటీ చైర్మన్ పొట్లపెల్లి శ్రీధర్ రావు -కిరణ్మయి, కమిటీ  సభ్యులు, అర్చకులు బి.రవీందర్ శర్మ సౌమిత్రి శ్రీరంగాచార్యులు, కృష్ణమాచార్యులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. చిలుపూరి కవిత రవీందర్ రెడ్డి, వెంకటలక్ష్మి కాంత్ కుమార్, సాంబశివరావు పుణ్యవతి అన్నదానం చేశారు.