మలిదశ ఉద్యమ కెరటం, నా సోదరసామానుడు సాయి చంద్ గారి హఠాన్మరణం చాలా బాధాకరం.. 

మలిదశ ఉద్యమ కెరటం, నా సోదరసామానుడు సాయి చంద్ గారి హఠాన్మరణం చాలా బాధాకరం.. 
  • గొప్ప మనసున్న మా తమ్ముడు ఇకలేడు అనే వార్త అబద్ధం అయితే బాగుండు..
  • నా కుటుంబంలో ఒక సభ్యుడిగా వుంటూ నేను చేపట్టే ప్రతి కార్యక్రమంలో ముందుండి తన అట పాట ద్వారా ప్రజల్లో చైతన్యం తెచ్చిన వీరుడు  భౌతికంగా మా దగ్గర లేనప్పటికీ ఎప్పుడు మాకు గుర్తువుంటాడు 
  • BRS పార్టీ మంచి నిబద్ధత కలిగిన గొప్ప నాయకుడిని, కళాకారుడిని కోల్పోయింది..
  • వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి
  • ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా:  ఈరోజు మలిదశ ఉద్యమ కెరటం, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్, ప్రముఖ కవి గాయకుడు వేద సాయి చంద్ గారు రాత్రి గుండెపోటుతో మరణించటం పట్ల తీవ్ర సంతాపం తెలిపిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ,ఈ ఆయన మాట్లాడుతూ సందర్భంగా మాట్లాడుతూ సాయి చంద్  మరణ వార్త విని షాక్ గురైన అని తెలిపారు,మంచి ఆప్తుడిని,గొప్ప మనస్సు ఉన్న మా తమ్ముడిని కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది అన్నారు,నిత్యం నాతో పాటు నా కుటుంబంలో ఒక సభ్యుడిగా వుంటూ నేను చేపట్టే ప్రతి కార్యక్రమంలో ముందుండి తన అట పాట ద్వారా ప్రజల్లో చైతన్యం తెచ్చిన వీరుడు  భౌతికంగా మా దగ్గర లేనప్పటికీ ఎప్పుడు మాకు గుర్తువుంటాడు అని అన్నారు,BRS పార్టీ మంచి నిబద్ధత కలిగిన గొప్ప నాయకుడిని, కళాకారుడిని కోల్పోయింది అని అన్నారు,అయన చేసిన సేవలను BRS పార్టీ తెలంగాణా యావత్ ప్రజానీకం మర్చిపోదు అని అన్నారు,వారి కుటుంబ సభ్యలను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ,ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దైవాన్ని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు, డీసీసీబీ డైరెక్టర్ శ్రీ జక్క రఘునందన్ రెడ్డి కూడా అయన మరణం పట్ల సంతాపం తెలిపారు,*