సాయిచంద్ అకాల మరణం పట్ల ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి & రాజేష్ రెడ్డి  తీవ్ర దిగ్భ్రాంతి

సాయిచంద్ అకాల మరణం పట్ల ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి & రాజేష్ రెడ్డి  తీవ్ర దిగ్భ్రాంతి

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా: తెలంగాణా ఉద్యమంలో ,తెలంగాణ పునర్ నిర్మాణంలో సాయిచంద్ సేవలు చిరస్మరణీయంగా నిలిచి పోతాయన్నారు,సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని,వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి సాయి చంద్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు,సాయిచంద్ స్వరం తెలంగాణ ఉద్యమానికి ఆయుపట్టుగా నిలిచింది,తెలంగాణ పునర్నిర్మాణంలో ఉద్యమ స్ఫూర్తి తో పని చేశారు,తెలంగాణ రాష్ట్రం ఒక గొప్ప కళాకారున్ని కోల్పోయింది.మంచి భవిష్యత్తు ఉన్న సాయిచంద్ మరణం తెలంగాణకు తీరని లోటు సాయిచంద్ చిన్న వయస్సులో గుండెపోటుతో మృతి చెందడం బాధాకరం..

ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలుపుతున్నాను