25న రాష్ట్రానికి జేపీ నడ్డా రాక

25న రాష్ట్రానికి జేపీ నడ్డా రాక

ముద్ర, తెలంగాణ బ్యూరో :-బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈనెల 25న రాష్ట్రానికి రానున్నారు. నాగర్ కర్నూల్ లో బీజేపి నిర్వహించబోయే బహిరంగ సభలో నడ్డా పాల్గొంటారని ఆ పార్టీ నేతలు వెల్లడించారు. అలాగే త్వరలో కేంద్రమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన కూడా ఖరారు అవుతుందని వారు తెలిపారు. ఇదిలావుండగా ఖమ్మంలో వాయిదా పడిన బీజేపీ బహిరంగ సభను త్వరలో ఆ ప్రాంతంలోనే నిర్వహిస్తామని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ చుగ్ వెల్లడించారు.