రాజేష్ రెడ్డి కి జననీరాజనం          

రాజేష్ రెడ్డి కి జననీరాజనం          

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా: అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తనయుడు ఇటీవల ఆ పార్టీని విభేదించి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సన్నహాలు పూర్తి చేసుకున్న ఆయన నియోజకవర్గంలోని మండలాలలో విస్తృతంగా పర్యటిస్తున్నారు తండ్రి దామోదర్ రెడ్డితో కలిసి ఐదు మండలాలలోని మండల కేంద్రాలలో నిర్వహిస్తున్న సమావేశాలకు ప్రజలు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలని కోరుతున్నారు.

తండ్రి దామోదర్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీగా పనిచేయడంతో ఆయనకు ఉన్న అనుచర వర్గం అంతా కొడుకు రాజేష్ రెడ్డికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు నియోజకవర్గ కేంద్రంలో సోమవారం నిర్వహించిన ద్విచక్ర మోటారు సైకిల్ ర్యాలీ మరియు వెలమ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తే సంపూర్ణ మెజార్టీతో గెలిపించుకుని తీరుతామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిని ఓడించేందుకు నాయకులు కార్యకర్తలు, సన్నద్ధం కావాలని ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాము అండగా నిలుస్తామని వారికి ఆయన భరోసా ఇచ్చారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేని ఎమ్మెల్యే వైఫల్యాలను వెంటపడుతూ యువకులను ప్రోత్సహించడంతో ద్విచక్ర వాహన ర్యాలీ భారీగా కొనసాగింది.