నల్లమల అడవిలో భారీ అగ్ని ప్రమాదం

ముద్ర,నాగర్ కర్నూల్:- నాగర్ కర్నూల్ జిల్లాలోని నల్లమల్ల అడవిలో మరోసారి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మల్లెలతీర్థం తాటిగుండాలలో అడవిలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు.

అగ్ని మాపక సిబ్బంది ఫైరింజన్ల సహయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నంలో ఫైర్ వాచర్ గాయపడినట్లు సమాచారం. వెంటనే అతడిని అధికారులు ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. మరోవైపు నల్లమల అడవుల్లో మంటలు ఎగసిపడుతుండటంతో సమీప ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.ప్రమాదం జరుగడానికి గల కారణం తెలియల్సి ఉంది.