కంటి వెలుగును ప్రారంభించిన ఎంపీపీ

కంటి వెలుగును ప్రారంభించిన ఎంపీపీ

ముద్ర,  తిరుమలగిరి: తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ అదేశాను సారం గురు వారం నాడు జాజిరెడ్డిగూడెం మండలం వేల్పుచర్ల గ్రామంలో  కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీపీ మన్నె రేణుక లక్ష్మీ నరసయ్య . ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుపేదలు పట్టణ ప్రాంతాలకు వెళ్లి ఖరీదైన  వైద్యం చేయించుకోలేరనే ఉద్దేశంతో కంటి వెలుగు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బొ డ్డు భద్రమ్మ రామలింగయ్య సర్పంచ్ కంభంపాటి కరుణాకర్ ఉప సర్పంచ్ మల్యాల రాంబాబు మార్కెట్ కమిటీ డైరెక్టర్ నరేష్ డాక్టర్ మణిరత్నం సిహెచ్ఓ చరణ్ నాయక్ తో పాటు తదితరులు పాల్గొన్నారు