సిద్దిపేటలో పట్టణ ప్రగతి దినోత్సవ వేడుకలు
- జెండాను ఆవిష్కరించిన మున్సిపల్ చైర్పర్సన్
- మహిళా ఉద్యోగులకు ముగ్గుల పోటీలు
ముద్ర ప్రతినిధి, సిద్దిపేట: తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శుక్రవారం నాడు పట్టణ ప్రగతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట పురపాలక సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు మున్సిపల్ చైర్ పర్సన్ కడవెరుగు మంజుల రాజనర్సు ,కమిషనర్ సంపత్ కుమార్ ,వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు, మాజీ చైర్మన్ కడవెరుగు రాజనర్సు, పట్టణ కౌన్సిలర్లు ,మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.వేడుకల నిర్వహించటంలో భాగంగా పురపాలక సంఘ కార్యాలయంలో చైర్ పర్సన్ కడవేరుగు మంజుల రాజనర్సు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పురపాలక సంఘ కార్యాలయంలో ముగ్గుల పోటీ జరిగింది.మహిళా ఉద్యోగులు వేసిన ముగ్గులను చైర్ పర్సన్ కడవేరుగు మంజుల రాజనర్సు, కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ పరిశీలించారు.