దేశంలో సుభిక్షం ప్రధాని మోడీ పుణ్యమే

దేశంలో సుభిక్షం ప్రధాని మోడీ పుణ్యమే
  • కేంద్ర పశుసంవర్ధక, శాఖ సహాయ మంత్రి పురుషోత్తం రూపాల

ముద్ర ప్రతినిధి:సిద్దిపేట:-ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలనలో భారతదేశం ఎంతో సుభిక్షంగా ఉందని కేంద్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ సహాయ మంత్రి పురుషోత్తం రూపాల అన్నారు. గురువారం నాడు సిద్దిపేట పట్టణంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగాజిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి తో కలిసి కేంద్రమంత్రి విలేకరులతో మాట్లాడారు.దేశవ్యాప్తంగా ఎక్కడికి వెళ్లినా ప్రజల్లో బిజెపి కి అనూహ్య స్పందన లభిస్తుందని ఆయన తెలిపారు.ప్రధానమంత్రి మోడీ నేతృత్వంలో 9 సంవత్సరాల పరిపాలన కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా బిజెపి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మహా జన సంపర్క్ అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అందులో భాగంగానే సిద్దిపేటకు విచ్చేసానని కేంద్రమంత్రి చెప్పారు.       బిజెపి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేపట్టిన మహాజన సంపర్క్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి బిజెపి చేస్తున్న అభివృద్ధిని వివరిస్తున్నామన్నారు.సిద్దిపేట జిల్లాలో ఎక్కడ పర్యటించినా బిజెపికి మంచి స్పందన లభిస్తుందని ఆయన తెలిపారు.వచ్చే ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర నాయకులు వంగ రామచంద్రారెడ్డి, రామచంద్రారావు, చొప్పదండి విద్యాసాగర్ రావు, ధనంజయ్ ఉడుత మల్లేశం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.