గ్రూప్ -4 పరీక్షకు ప్రత్యేక బస్సులు
![గ్రూప్ -4 పరీక్షకు ప్రత్యేక బస్సులు](https://mudranews.in/uploads/images/2023/06/image_750x_649db7cfe086b.jpg)
శంకరపట్నం ముద్ర జూన్ 29:శనివారం రోజున జరుగబోయే గ్రూప్ - 4 పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధుల కొరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు హుజురాబాద్ డిపో మేనేజర్ పి అర్పిత ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్, కరీంనగర్ నుండి హుజురాబాద్, జమ్మికుంట, కమలాపూర్, ఎల్కతుర్తి లోని పరీక్షా కేంద్రాల వరకు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 వరకు ఈ ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని, కావున పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు. ఎంక్వయిరీ ఫోన్ నెంబర్ 9491547320. ఈ నెంబర్ కు సంప్రదించి కావాల్సిన సమాచారం తెలుసుకోవచ్చని ఆమె తెలిపారు.