శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఆర్టీసీ బస్సు- క్రూజర్ ఢీ

శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఆర్టీసీ బస్సు- క్రూజర్ ఢీ
  •  శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఆర్టీసీ బస్సు- క్రూజర్ ఢీ
     
  • 15 మంది యాత్రికులకు తీవ్ర గాయాలు
     
  • క్షతగాత్రులను అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

ముద్ర అచ్చంపేట( జూలై 24):-అమ్రాబాద్ మండలం శ్రీశైలం- హైదరాబాద్ ప్రధాన రహదారి వట్టువర్లపల్లి సమీపంలోని రాస మల్ల బావి వద్ద సోమవారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు క్రూజర్ ఢీకొన్న ఘటనలో 15 మందికి తీవ్ర గాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈగలపెంట పోలీసుల సమాచారం మేరకు హైదరాబాద్ బిహెచ్ఇఎల్ కు చెందిన ఆర్టీసీ బస్సు శ్రీశైలం నుండి హైదరాబాదుకు వెళుతున్న క్రమంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కు చెందిన యాత్రికులు క్రూజర్ లో  శ్రీశైలం వెళుతున్న క్రమంలో ఆర్టీసీ బస్సును ఎదురుగా బలంగా క్రూజర్ ఢీకొనడంతో క్రూజర్ లో ఉన్న 15 మందికి తీవ్ర గాయాలు కాగా వారిని అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.